ప్రకాశం జిల్లా మార్టూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. తమిళనాడులోని రాయవెల్లూరు నుంచి ఒడిశాకు పార్దిబన్ అనే వ్యక్తి... కారులో వెళ్తున్నాడు. ఈ క్రమంలో మార్టూరుకు చేరుకోగానే ఆయన ప్రయాణిస్తున్న కారు టైరు పగిలిపోయింది. ఈ ప్రమాదంలో కారు బోల్తా పడింది. పార్దిబన్కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
టైరు పేలి బోల్తా పడిన కారు.. వ్యక్తికి స్వల్ప గాయాలు - ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం
ప్రకాశం జిల్లా మార్టూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. టైరు పేలిపోవటంతో కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ వ్యక్తికి స్వల్పగాయాలయ్యాయి.
పల్టీలు కొట్టి బోల్తా పడిన కారు.. వ్యక్తికి స్వల్ప గాయాలు