ప్రకాశం జిల్లా కురిచేడు మండలం వెంగాయపాలెం వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని ముగ్గురు వ్యక్తులు గాయాలపాలయ్యారు. గుంటూరు జిల్లా వినుకొండలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన సంతోష్కుమార్, ఝూన్సీ, కిరణ్మయిలు కురిచేడులో ఓ వివాహానికి హాజరై తిరిగి ద్విచక్రవాహనంపై స్వస్థలాలకు వస్తుండగా ప్రమాదం జరిగింది. గమనించిన స్థానికులు క్షతగాత్రులను వినుకొండలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని ముగ్గురికి తీవ్రగాయాలు - కురిచేడు మండలంలో రోడ్డు ప్రమాదం తాజా వార్తలు
గుర్తు తెలియని వాహనం ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడం వల్ల ముగ్గురు వ్యక్తులు తీవ్ర గాయపడ్డారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కురిచేడు మండలం వెంగాయపాలెం వద్ద జరిగింది.
![గుర్తు తెలియని వాహనం ఢీకొని ముగ్గురికి తీవ్రగాయాలు road accident at vengayapalem and three people injured at prakasam district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8322620-395-8322620-1596730583056.jpg)
రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయపడ్డ ముగ్గుర వ్యక్తులు