ఆంధ్రప్రదేశ్

andhra pradesh

చీరాలలో రెడ్​జోన్​ను ప్రకటించిన అధికారులు

By

Published : Jul 2, 2020, 12:32 PM IST

ప్రకాశం జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. చీరాలలో మరో 9 కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే పట్టణంలో 80 పాజిటివ్ కేసులు వచ్చాయని అధికారులు తెలిపారు.

redzone in cheerala
చీరాలలో రెడ్​జోన్​

ప్రకాశం జిల్లా చీరాలలో కరోనా కోరలు చాచుతోంది. పట్టణంలో మరో 9 కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే ఈ ప్రాంతంలో 80 కోవిడ్ కేసులు నిర్ధరణ అయ్యాయని అధికారులు తెలిపారు. దీంతో పట్టణంలోని పలు ప్రాంతాలను రెడ్​జోన్​గా ప్రకటించారు. ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్, మెడికల్ దుకాణాలు సైతం రెడ్​జోన్​లోకి వెళ్లటంతో వాటిని మూసేశారు. జయంతిపేట, ఆనందపేట, విఠల్ నగర్, వైకుంఠపురం, అన్నదాతవీధి, హారీస్ పేట, శాంతి నగర్​లలో 9 కేసులు నమోదయ్యాయి. అప్రమత్తమైన అధికారులు ఆయా ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. ఒకటో పట్టణ ఎస్సై సురేష్ ఆధ్వర్యంలో పోలీసులు బారికేట్లు ఏర్పాటు చేశారు.

ABOUT THE AUTHOR

...view details