ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 19, 2021, 7:11 PM IST

ETV Bharat / state

మొగళ్లూరులో 100 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత

ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం మొగళ్లూరులో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. 100 బస్తాల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని.. రెండు వాహనాలను సీజ్ చేశారు.

rice seized
మొగళ్లూరులో 100 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత

ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం మొగళ్లూరు సమీపంలో రెండు వాహనాలలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. 100 బస్తాల రేషన్ బియ్యాన్ని వెలిగండ్ల ఎస్సై రాజ్​కుమార్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రెండు వాహనాలను పోలీస్​స్టేషన్​కి తరలించి.. నిందితులపై కేసు నమోదు చేశారు. బియ్యాన్ని అమ్మితే ఊరుకోమని…వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details