ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 22, 2021, 8:32 AM IST

ETV Bharat / state

రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ సరకుల వాహనాలు ప్రారంభం

ఇంటికే రేషన్​ సరుకులను చేరవేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం డోర్​ డెలివరీ వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. చిత్తూరులోని డీఎస్​ఏ స్టేడియంలో ఈ వాహనాలను ఉప ముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి ప్రారంభించారు.

ration door delivery vehicles started
రేషన్​ డోర్​ డెలివరీ వాహనాల ప్రారంభం

ప్రజా పంపిణీ వ్యవస్థలో సరికొత్త చరిత్రకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారని ఉప ముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి అన్నారు. చిత్తూరులోని డీఎస్​ఏ స్టేడియంలో రేషన్​ సరుకుల డోర్​ డెలివరీకి కేటాయించిన 724 వాహనాలను ఆయన ప్రారంభించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా డోర్ డెలివరీ వాహనాలను సబ్సిడీపై అందించి, నిరుద్యోగులకు ఉపాధి కల్పించారని చెప్పారు. నాణ్యమైన స్వర్ణ బియ్యాన్ని రేషన్​ కార్డుదారులకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, కలెక్టర్ భరత్ గుప్తా, ఎమ్మెల్యేలు ఎమ్.ఎస్​ బాబు, ద్వారకనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రకాశం జిల్లాలో..

కనిగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాలకు సంబంధించిన 56 రేషన్ పంపిణీ వాహనాలు ఆయా మండల కేంద్రాలకు చేరాయి. కనిగిరి-15 , చంద్రశేఖరపురం-9, హనుమంతునిపాడు-7, పామూరు-12, పెద్ద చెర్లోపల్లి-7, వెలిగండ్ల-6 వాహనాలను సిద్ధం చేశారు. వీటికి మొదటగా ట్రయల్ రన్ నిర్వహించి... సంబంధిత సచివాలయాలకు అప్పజెప్తామని కనిగిరి తాహసీల్దార్ తెలిపారు.

ఇదీ చదవండి:

కడపలో రేషన్ పంపిణీ వాహనాలు ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details