ప్రకాశం జిల్లా మార్కాపురంలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి. రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా తిరుమల తరహాలో ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఉదయం 5 గంటల నుంచి సూర్యప్రభ వాహనంతో ఉత్సవాలు ప్రారంభమై.. చంద్ర ప్రభ వాహనంలో ముగుస్తాయి. సాయంత్రం 6 గంటలకు వెండి రథంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి భక్తులకు దర్శనిమిస్తారు. ఈ క్రమంలో.. ఉదయం నుంచి ఉత్సవాలు నేత్రపర్వంగా కొనసాగుతున్నాయి. శేష వాహనంపై ఊరేగిన స్వామి వారిని దర్శించుకునేందుకు పుర వీధుల్లో భక్తులు పోటెత్తారు. వాహనసేవలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
ఒంగోలులోని శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవస్థానంలో అత్యంత వైభవంగా రథసప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 6 గంటల నుంచి 8 వరకు సూర్యప్రభ వాహనంపై స్వామి వారు దర్శనమిచ్చారు.
చీరాలలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. వీరరాఘవస్వామి దేవాలయంలో రథసప్తమి వేడుకలు అనంతరం స్వామివారికి నగరోత్సవం చేశారు. అనంతరం పూజలు యధావిధిగా సూర్యభగవానుడికి పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.