ప్రకాశం జిల్లా మార్కాపురం చెరువుకట్టపై ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటోలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆంజనేయరెడ్డి అనే రైల్వే ఉద్యోగి మృతి చెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. రాయవరం రైల్వే స్టేషన్ నుంచి మార్కాపురం వస్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న సుధా గ్యాస్కు చెందిన ఆటో వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆంజనేయరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వద్ద ఉన్న రైల్వే ఐడి కార్డ్, ఆధార్ కార్డుల ప్రకారం ఆనంతరపురానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.
మార్కాపురంలో రెండు ఆటోలు ఢీ.. రైల్వే ఉద్యోగి మృతి - ప్రకాశం జిల్లా రోడ్డు ప్రమాదంలో రైల్వే ఉద్యోగి మృతి
ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటోలు ఢీకొన్న ఘటనలో రైల్వే ఉద్యోగి మృతి చెందాడు. ఈ ప్రమాదం ప్రకాశం జిల్లాలో జరిగింది.
![మార్కాపురంలో రెండు ఆటోలు ఢీ.. రైల్వే ఉద్యోగి మృతి rail employee died in road accident in prakasham district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13469004-40-13469004-1635306520583.jpg)
rail employee died in road accident in prakasham district
చెరువుకట్టపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని వాహనదారులు చెబుతున్నారు. రహదారి విస్తరణ చేపట్టి ప్రమాదాలు నివారించాలని వారు కోరుతున్నారు.
ఇదీ చదవండి: pds rice scam: కైకలూరు ఎంఎల్ఎస్ పాయింట్లో భారీ కుంభకోణం.. రూ. కోటి విలువైన బియ్యం మాయం