ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుదాఘాతంతో నిండు గర్భిణీ మృతి - Pregnant death with electrocution in markapuram

విద్యుదాఘాతంతో నిండు గర్భిణీ మృతి చెందింన ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం గొట్టిపడియ గ్రామంలో జరిగింది. టీవీ స్వీచ్ వేయబోయి విద్యుత్ సరఫరా కావటంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

praksam district
విద్యుదాఘాతంతో నిండు గర్భిణీ మృతి

By

Published : Jul 6, 2020, 7:22 AM IST

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం గొట్టిపడియ గ్రామంలో విషాదం జరిగింది. గ్రామానికి చెందిన తొమ్మిది నెలల గర్భిణీ దండెబోయిన గాలెమ్మ విద్యుదాఘాతంతో మృతి చెందింది. ఇంట్లో టీవీ పెట్టేందుకు స్విచ్ వేయబోగా.. విద్యుత్ సరఫరా జరిగి ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మరో వారం, పది రోజుల్లో ప్రసవించాల్సిన ఆమె విద్యుత్ షాక్​తో మృతి చెందటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈమెకు ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details