ఆంధ్రప్రదేశ్

andhra pradesh

"60 రోజుల్లో ఛార్జ్​షీట్ దాఖలు చేయాలి'

By

Published : Oct 16, 2020, 9:09 PM IST

ప్రకాశం జిల్లా ఎస్పీ.. మిగతా పోలీసు యంత్రాంగంతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పెండింగ్ కేసులను తొందరగా పూర్తి చేయాలని వారికి సూచించారు.

prakasham district sp conference
ప్రకాశం జిల్లా ఎస్పీ

ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ పోలీసు కార్యాలయం నుంచి జిల్లాలో ఉన్న డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో నేర సమీక్షా సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. ఈ భేటీలో ప్రత్యేకంగా బాలికలు, మహిళలపై జరిగే నేరాల గురించి ఎస్పీ మాట్లాడారు. పెండింగ్ కేసులను వెంటనే దర్యాప్తు పూర్తి చేసి, చార్జ్​షీట్ దాఖలు చేయాలని ఆదేశించారు..హోంశాఖ కూడా ప్రతిరోజు కేసుల గురించి పరిశీలిస్తుందని అన్నారు. 60 రోజుల్లో కేసు దర్యాప్తు పూర్తిచేసి కోర్టులో ఛార్జ్​షీట్ దాఖలు చేయాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details