ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సీజ్ అయిన బండ్లతో నిండిన సినిమా థియేటర్

By

Published : May 5, 2020, 5:18 PM IST

కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు అధికారులు లాక్ డౌన్ ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారి వాహనాలను సీజ్ చేస్తున్నారు. ప్రకాశం జిల్లా చీరాలలో పోలీసులు ఇప్పటివరకూ.. 250కి పైగా వాహనాలు సీజ్ చేశారు.

prakasam dst chirala police seized vehiles  of  people iunnecessarly came on road
prakasam dst chirala police seized vehiles of people iunnecessarly came on road

కరోనా కట్టడి నేపథ్యంలో పోలిసుల ఆంక్షలను ఉల్లంఘించిన వాహనాలను ప్రకాశం జిల్లా చీరాలలో ఓ సినిమా థియేటర్ లో ఉంచారు. జప్తు చేసిన వాహనాలను జరిమానా కట్టించుకుని ఇస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆంక్షలు తొలగేవరకూ ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details