ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వర్షాల భయం.. పూర్తిగా రాకముందే పంట కోస్తున్న రైతన్నలు - ప్రకాశం జిల్లా కనిగిరి రైతుల వార్తలు

నివర్ తుపాను అన్నదాతల కళ్లల్లో నీరు నింపింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట నీటిపాలైంది. పోయింది పోగా ఉన్న పంటైనా చేతికొస్తుందేమో అని ఆశగా ఉన్న రైతులను 2 రోజులుగా కురుస్తున్న జల్లులు మరింత కలవరపెడుతున్నాయి. చేసేది లేక పూర్తిగా రాని పంటనే కోసేసి నూర్పిళ్లు చేస్తున్నారు.

crop
వర్షాల భయం.. పూర్తిగా రాకముందే పంట కోస్తున్న రైతన్నలు

By

Published : Dec 10, 2020, 5:29 PM IST

ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని పలు మండలాల్లో రైతులు మినుము, బొబ్బర్లను సాగుచేశారు. నివర్ తుపాను కారణంగా కురిసిన వర్షాలకు దాదాపు చాలా పంట నష్టపోయారు. ఉన్న పంటను చూసుకునైనా నిబ్బరంగా ఉన్న రైతులను.. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలు కలవరపెడుతున్నాయి. పూర్తిగా పంట రాకముందే కోత కోసి నూర్పిళ్లు చేస్తున్నారు. నియోజకవర్గంలో సుమారు 40 వేల హెక్టార్లలో పంటవేయగా.. 18వేల హెక్టార్లలో పంట నష్టపోయినట్లు అధికారులు అంచనా వేశారు.

ABOUT THE AUTHOR

...view details