ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పంట నష్టాన్ని పరిశీలించిన ప్రకాశం కలెక్టర్ - బొల్లాపల్లి పొలాలను పరీశీలించిన ప్రకాశం కలెక్టర్

ప్రకాశం జిల్లా మార్టూరు మండలం బొల్లాపల్లిలో.. భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకుంటామని కలెక్టర్ తెలిపారు. విత్తనాలు, ఇన్​పుట్​ సబ్సిడీ, మార్క్​ఫెడ్​ ద్వారా పంట కొనుగోలుకు సహాయం చేస్తామని పేర్కొన్నారు. పశు వైద్య శిబిరం కోసం రైతులు విజ్ఞప్తి చేయగా.. ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

collector visit crop damage
పంట నష్టాన్ని పరిశీలించిన కలెక్టర్

By

Published : Oct 26, 2020, 8:44 AM IST

వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ప్రకాశం జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ చెప్పారు. మార్టూరు మండలం బొల్లాపల్లిలో దెబ్బతిన్న పంటలను ఆదివారం ఆయన పరిశీలించారు. మార్కుఫెడ్ ద్వారా పంటలు కొనుగోలు చేయిస్తామన్నారు. ఇన్​పుట్ సబ్సిడీ ఇప్పిస్తామని.. రబీలో ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేందుకు నాణ్యమైన విత్తనాలు ఇస్తామని తెలిపారు. శనగలకు బదులు మొక్కజొన్న సాగు చేసుకోవాలని సూచించారు.

సెప్టెంబరు నెలాఖరు నుంచి ఈ నెల మొదటి వరకు కురిసిన వర్షాలకు.. బొల్లాపల్లిలోని పంటపొలాలు నీటమునిగాయి. రైతులు 750 ఎకరాలు సాగు చేయగా.. 450 ఎకరాలకు పైగా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కోతదశకు వచ్చిన మినుము పంట మునిగిపోవడంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు సుమారు ఏడు వేల వరకు పెట్టుబడి పెట్టామని తెలిపారు. పశువులకు జబ్బు చేసిందని, వైద్య శిబిరం ఏర్పాటు చేయించాలని కోరగా.. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details