ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గనులశాఖపై హైకోర్టులో పిటిషన్​.. ఏప్రిల్ 20న తీర్పు - granite mining in ongole

గనులశాఖకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్​ దాఖలైంది. గ్రానైట్ తరలించుకునేందుకు గనులశాఖ అధికారులు తమకు అనుమతులివ్వటం లేదని ఒంగోలుకు చెందిన సదరన్ రాక్స్ అండ్ మినరల్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైకోర్టులో పిటిషన్ వేసింది.

petition in high court against mines and minerals  department
petition in high court against mines and minerals department

By

Published : Mar 31, 2021, 4:07 PM IST

గ్రానైట్ తరలించుకునేందుకు గనులశాఖ అధికారులు తమకు అనుమతులివ్వటం లేదని ఒంగోలుకు చెందిన సదరన్ రాక్స్ అండ్ మినరల్స్ ప్రైవేట్ లిమిటెడ్.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్​పై నేడు ధర్మాసనం విచారణ చేసింది.

గ్రానైట్​ను తరలించేందుకు ఉద్దేశపూర్వకంగానే గనుల శాఖ అధికారులు అనుమతులివ్వలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం.. కేసును ఏప్రిల్​ 20కు వాయిదా వేసింది. ఈ కేసులో ఏప్రిల్ 20న తీర్పు వెలువరిస్తామని ధర్మాసనం తెలిపింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details