ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భయపెడుతున్న హైటెన్షన్‌ విద్యుత్‌ లైను... బిక్కుబిక్కుమంటున్న జనం - ఒంగోలులో ఇబ్బందిపెడుతున్నహెటెన్షన్ వైర్లు

ఒంగోలులో కాలనీల మధ్య ఉన్న హెటెన్షన్‌ లైను... ప్రజలను భయపెడుతోంది. ఇళ్లపైనే ఉన్న తీగలు.. కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కొద్దిపాటి గాలులకే భవనాలపై ఉన్నవారికి అందేంత కిందికి కరెంటు తీగలు వస్తున్నాయి. ఎప్పుడు ఏ ముప్పు ముంచుకొస్తుందో అని జనం ఆందోళన చెందుతున్నారు.

people-are-having-trouble-with-the-182-kv-power-line-in-ongole-city
ఒంగోలులో ఇబ్బంది పెడుతున్నహెటెన్షన్ లైన్

By

Published : Dec 20, 2020, 1:52 PM IST

ఒంగోలులో ఇబ్బంది పెడుతున్నహెటెన్షన్ లైన్

ఒంగోలు నగరం మీదుగా ఇంకొల్లు వరకు చాలా ఏళ్ల క్రితమే హైటెన్షన్‌ విద్యుత్‌ లైను ఏర్పాటుచేశారు. కాలక్రమంలో విద్యుత్‌ లైనుకు రెండువైపులా భవనాలు వెలిశాయి. అలా విస్తరిస్తూ రావడంతో విద్యుత్‌ లైను ఇప్పుడు నగరం నడిబొడ్డుకు చేరింది. కొన్నాళ్లుగా కరెంటు తీగలు కిందికి జారిపోయి ప్రమాదకరంగా తయారయ్యాయి. రాజీవ్‌నగర్, నిర్మల్‌నగర్, అంజయ్య రోడ్డు, బృందావన్‌ నగర్, వీఐపీ రోడ్డు, బాలకృష్ణాపురంలో... ఇప్పటివరకు 30మంది వరకు విద్యుదాఘాతానికి బలయ్యారు.

హైటెన్షన్‌ విద్యుత్‌ లైను మార్చాలన్న ప్రజల డిమాండ్ మేరకు... ఒంగోలు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చర్యలు చేపట్టారు. 56.74 కోట్ల అంచనాతో భూగర్భ కేబుల్‌ పనులకు ఫిబ్రవరిలో శంకుస్థాపన చేశారు. అయితే నెలలు గడుస్తున్నా పనులు మొదలవకపోవడంతో... గాలులు వీచినప్పుడు, వర్షాలు పడినప్పుడు ప్రజలు భయం భయంగానే కాలం గడుపుతున్నారు. భూగర్భ కేబుల్ పనులు నాలుగు నెలల్లో పూర్తిచేస్తామని విద్యుత్‌శాఖ అధికారులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details