ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 25, 2020, 10:58 AM IST

ETV Bharat / state

ఊరు దారి సూచిక బోర్డు ఏర్పాటు చేసిన యువకులు

216వ జాతీయ రహదారి నుంచి పెదగంజాంకు వెళ్లాలంటే సూచిక బోర్డులు లేక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇది గమనించిన కొందరు యువకులు.. కొంత మొత్తం సేకరించి ప్రధాన రహదారిపై బోర్డును ఏర్పాటు చేశారు.

peddaganjam name board kept at national highway in prakasam district
పెదగంజాం బోర్డు పెట్టిన అరోరా గ్రామాభివృద్ధి సమితికి చెందిన యువకులు

జాతీయ రహదారి నుంచి ప్రకాశం జిల్లా చినగంజాం మండలం తీరప్రాంతమైన పెదగంజాంకు సూచికల బోర్డులు లేవు. గ్రామానికి వెళ్లేందుకు వాహనదారులు, కొత్తవారు ఇబ్బందులు పడుతున్నారు. ఇది గమనించిన అరోరా గ్రామాభివృద్ధి సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు వల్లబుని ఉదయభాస్కర్​... కొంత మంది సభ్యులు కలిసి రూ. 15 వేల వ్యయంతో ఓ బోర్డును తయారుచేయించి జాతీయరహదారి పక్కన అమర్చారు.

ABOUT THE AUTHOR

...view details