ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 14, 2020, 3:15 PM IST

ETV Bharat / state

నాయుడువారి పాలెంలో త్వరలో చెక్ డాం.. స్థల పరిశీలన చేసిన నేతలు

పర్చూరు వైకాపా నాయుకుడు రావి రామనాథం బాబు.. నాయుడువారిపాలెం సందర్శించి గ్రామస్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అక్కడ సాగు, తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు చెక్​డాం నిర్మించాలని భావించారు. ఇందుకోసం తగిన స్థలాన్ని సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు.

paruchuru ycp leader ravi ramanadham babu checked place to construct checkdam in naiduvaripalem
చెక్​డాం కోసం అధికారులతో కలిసి స్థలం పరిశీలిస్తున్న వైకాపా నేత

గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడకుండా సాగు, తాగునీటి అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రకాశం జిల్లా పర్చూరు వైకాపా నాయకుడు డీసీఎంఎస్​ చైర్మన్​ రావి రామనాథం బాబు తెలిపారు. నాయు డువారి పాలెంలో ఆయన పర్యటించారు.

గ్రామస్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నాయుడువారిపాలెం, చుట్టుపక్కల గ్రామాల్లో నీటి కొరత ఉందని గుర్తించారు. సమస్య పరిష్కారానికి చెక్​డాం నిర్మించబోతున్నట్టు చెప్పారు. అధికారులతో కలిసి ఆయన స్థలాన్ని పరిశీలించారు.

ABOUT THE AUTHOR

...view details