ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రకాశం జిల్లాలో పాజిటివ్ కేసులు.. అప్రమత్తమైన అధికారులు - ప్రకాశంలో కొవిడ్-19 వార్తలు

ప్రకాశం జిల్లాలో కొత్తగా వచ్చిన 3 పాజిటివ్ కేసుల్లో 2 అద్దంకి నియోజకవర్గానికి చెందినవేనని అధికారులు వెల్లడించారు. అప్రమత్తమైన అధికారులు బాధితులతో కాంటాక్ట్ లో ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు.

out of three two corona positive cases comes from chennai in prakasham
out of three two corona positive cases comes from chennai in prakasham

By

Published : May 28, 2020, 7:42 AM IST

Updated : May 28, 2020, 8:50 AM IST

ప్రకాశం జిల్లాలో కొత్తగా 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో 2 అద్దంకి నియోజకవర్గానికి చెందినవేనని అధికారులు వెల్లడించారు. సంతమాగులూరు, కొరిసపాడు మండలం పమిడిపాడు శివార్లలోని కనగారివారి పాలేనికి చెందిన వారికి వైరస్ సోకినట్టు గుర్తించారు. బాధితులిద్దరూ చెన్నై నుంచి వచ్చిన వారేనని తెలిపారు.

ఈ ఘటనపై అప్రమత్తమైన అధికారులు.. కరోనా సోకిన వారితో ఇన్ని రోజులుగా కాంటాక్ట్ లో ఉన్న వారిని గుర్తించే పనిలో పడ్డారు. వారికి పరీక్షలు చేసి అనుమానితులను క్వారంటైన్ కు పంపించాలని నిర్ణయించారు.

Last Updated : May 28, 2020, 8:50 AM IST

ABOUT THE AUTHOR

...view details