ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఒంగోలు బార్ అసోసియేషన్​కు 50ఏళ్లు..న్యాయవాదుల టీ-20 మ్యాచ్​

ఒంగోలు బార్ అసోసియేషన్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నవ్యాంధ్ర న్యాయవాధుల క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టీ-20 క్రికెట్ మ్యాచ్ ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర హైకోర్టు జడ్జి వెంకటరమణ హాజరయ్యారు.

By

Published : Apr 2, 2021, 5:54 PM IST

Updated : Apr 2, 2021, 7:36 PM IST

Navyandhra lawyers cricket match
ఒంగోలులో నవ్యాంధ్ర న్యాయవాధుల క్రికెట్ మ్యాచ్

ఒంగోలు బార్ అసోసియేషన్ 50ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నవ్యాంధ్ర న్యాయవాదుల క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదుల టీ-20 క్రికెట్ మ్యాచ్​ను నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టు జడ్జి వెంకటరమణ హాజరై.. మ్యాచ్​ను ప్రారంభించారు. అనంతరం ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ బౌలింగ్​లో హైకోర్టు న్యాయమూర్తి వెంకటరమణ బ్యాటింగ్ చేసి.. ఆటగాళ్లను ఉత్సాహపరిచారు.

ఇటువంటి క్రీడలు ఉత్సాహాన్ని ఇవడమే కాక.. సూక్ష్మంగా ఆలోచించగలిగే శక్తిని ఇస్తాయని న్యాయమూర్తి వెంకటరమణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి శ్రీమతి వెంకట జ్యోతిర్మయి, బార్ కౌన్సిల్ సభ్యులు సుదర్శన్ రావు, ప్రకాశం జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ బొడ్డు భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో భాజపా హౌస్ మోషన్ పిటిషన్

Last Updated : Apr 2, 2021, 7:36 PM IST

ABOUT THE AUTHOR

...view details