ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలంలోని రాచపూడి గ్రామంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉసురుమాటి బ్రహ్మయ్య పర్యటించారు. గ్రామంలోని ఎస్సీలు ఇబ్బందులకు గురవుతున్నారని, వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గుండ్లకమ్మ నీరు దళితుల భూములకు చేరకుండా కల్వర్టు నిర్మాణాన్ని ఆపాలని, ఊరికి పక్కనే ప్రమాదకరంగా ఉన్న బావిని పూడ్చాలని ఉన్నతాధికారులకు, మండల అధికారులకు వినతి పత్రం అందించినా ఫలితం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'దళితుల సమస్యలు పరిష్కరించాలి'
ప్రకాశం జిల్లా రాచపూడిలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మయ్య పర్యటించారు. గ్రామంలోని పలు సమస్యలు, ఇబ్బందులను ఆయన పరిశీలించారు.
రాచపూడిలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పర్యటన