ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 18, 2020, 7:27 PM IST

ETV Bharat / state

కావాలనే కేసులు పెట్టి వేధిస్తున్నారు: ఎమ్మెల్యే వీరాంజనేయస్వామి

మంత్రి బాలనేని శ్రీనివాసరెడ్డి పై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు షేర్ చేసిన వ్యక్తులపై అక్రమ కేసులు పెట్టారని.. తెదేపా ఎమ్మెల్యే బి వీరాంజనేయ స్వామి వ్యాఖ్యానించారు. అరెస్టు చేయటమే కాకుండా వారిని దారుణంగా హింసకు గురిచేశారని ఆరోపించారు.

mla veeranjaneyaswamy
mla veeranjaneyaswamy

ఒంగోలులో పోలీసుల తీరుపై తెదేపా ఎమ్మెల్యే బి. వీరాంజనేయ స్వామి మండిపడ్డారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, అతని కుమారుడు ప్రణీత్‌ రెడ్డిపై సామాజిక మాధ్యమాల్లో వచ్చిన సందేశాలను షేర్‌ చేసిన వ్యక్తులపై.. అక్రమంగా కేసులు పెట్టారన్నారు. అరెస్టు చేయడం దారుణమని ఆగ్రహించారు. ఈ విషయంపై మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

నాయుడు పాలేనికి చెందిన సందీప్‌, చంద్రశేఖర్‌ను పోలీసులు అరెస్టు చేసి.. దేశ ద్రోహం, కుట్ర వంటి కేసులు పెట్టి బెయిల్‌ రాకుండా.. చేశారని ఆరోపించారు. కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చి రిమాండ్‌కు తరలించే ప్రయత్నం చేశారన్నారు. కానీ.. వీరిద్దరూ కేవలం పోస్టులను షేర్‌ మాత్రమే చేశారని స్పష్టం చేశారు. చివరికి 3వ అదనపు మెసిస్టేట్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసిందని పేర్కొన్నారు.

తనను అక్రమంగా అరెస్ట్ చేసి.. రూరల్ పోలీసులు కొట్టారని బెయిల్ పై విడుదలైన సందీప్ పేర్కొన్నారు. మంత్రి బాలినేని కుమారుడు బాలినేని ప్రణీత్ రెడ్డితో తనకు ప్రాణ హాని ఉందని చెప్పారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో రికార్డుస్థాయిలో కరోనా కేసులు, మరణాలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details