ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 22, 2020, 12:28 AM IST

ETV Bharat / state

సంజీవిని బస్సు ప్రారంభంలో నిబంధనలకు నీళ్లొదిలిన ఎమ్మెల్యే

ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు సంజీవిని బస్సును, ట్రూనాట్ కిట్ టెస్టింగ్ ల్యాబ్​ను ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ప్రారంభించారు. రాష్ట్రంలో రోజురోజుకి కొవిడ్-19 కేసులు పెరుగుతుండటం ప్రజలకు త్వరితగతిన పరీక్షలు నిర్వహించేందుకు ముఖ్యమంత్రి జగనన్న సంజీవిని పేరుతో మొబైల్ ల్యాబ్ లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అయితే ఈ కార్యాక్రమంలో ఎక్కడా భౌతిక దూరం కనిపించకపోవడం పలు విమర్శలు వినిపిస్తున్నాయి.

mla-maddishetti-venugopal
సంజీవిని బస్సు ప్రారంభించిన ఎమ్మెల్యే


రాష్ట్రం మొత్తం మీద నడిపిస్తున్న 58 సంజీవిని మొబైల్ ల్యాబ్ బస్సుల్లో ఒకటి మన దర్శి నియోజకవర్గానికి కేటాయించడం చాలా సంతోషంగా ఉందని మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. సంజీవిని మొబైల్ బస్సును ఆయన లాంఛనంగా ప్రారంభించారు. సంజీవిని బస్సులో సేకరించిన నమూనాలను దర్శిలోనే పరీక్షలు నిర్వహించే విధంగా ల్యాబ్​ను కూడా ప్రారంభించటం జరిగిందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో ఎక్కడ భౌతిక దూరం పాటించకపోవడం పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే రాగానే అభిమానులు, చోట నాయకులు గుంపులు గుంపులుగా చేరడం పోలీసులు సైతం చేసేదేమీ లేక మిన్నకుండి పోయారు. అయితే పోలీసులు ప్రజలకు అన్ని నియమాలు చెబుతారు.. రాజకీయ నాయకులకు చెప్పరా..? వారికి కరోనా రాదా అంటూ స్థానికులు గుసగుసలాడుతున్నారు.

ఇవీ చూడండి...

ప్రకాశం జిల్లాలో బాలికతో వ్యభిచారం... ముఠా కోసం గాలింపు

ABOUT THE AUTHOR

...view details