ప్రకాశం జిల్లాలోని కంభం సమీపంలోని కంభం చెరువును సందర్శించడానికి.. ఓ విశ్రాంత ఆర్మీ ఉద్యోగి కుటుంబంతో బయలుదేరారు. మార్కాపురం నుంచి ఇన్నోవా వాహనాన్ని అద్దెకు తీసుకున్నారు. తిరుగు ప్రయాణంలో.. వారి వాహనం కంభం రహదారిపై నున్న హీరో షోరూమ్ వద్ద డివైడర్ను ఢీకొంది. ఈ ఘటనలో 10 మందికి తీవ్ర గాయాలు కాగా.. వారి వెనుక వస్తున్న గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు గమనించి సహాయం అందించారు. 108 వాహనంలో కంభం ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం వారిని ఒంగోలు రిమ్స్కు పంపించాలని వైద్యులు ఎమ్మెల్యేకు తెలిపారు. తన సొంత ఖర్చుతో ఆయన అంబులెన్స్ ఏర్పాటు చేసి.. బాధితులను తరలించారు.
రోడ్డు ప్రమాద బాధితులకు ఎమ్మెల్యే రాంబాబు సాయం - ప్రమాద బాధితులను కాపాడిన ఎమ్మెల్యే రాంబాబు
రోడ్డు ప్రమాద బాధితులకు ఎమ్మెల్యే అన్నా రాంబాబు సహాయం చేశారు. ప్రకాశం జిల్లా కంభం రహదారిపై జరిగిన ప్రమాదంలో గాయపడిన వారిని సొంత ఖర్చులతో ఒంగోలు రిమ్స్కు తరలించారు.
![రోడ్డు ప్రమాద బాధితులకు ఎమ్మెల్యే రాంబాబు సాయం prakasam road accident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9311814-454-9311814-1603668624098.jpg)
కంభం రోడ్డు ప్రమాదం