ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

షర్మిలమ్మ మా వైఎస్ కుటుంబ సభ్యురాలు.. మేమంతా ఒక్కటే: మంత్రి బాలినేని - ప్రకాశం జిల్లా వార్తలు

Minister Balineni Srinivasa Reddy on YS Sharmila: "షర్మిలమ్మ మా వైఎస్ కుటుంబ సభ్యురాలు, మేమంతా ఒక్కటే.." అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. వైఎస్​ షర్మిల తాజాగా ఏపీలో రాజకీయాలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు.

మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి
Minister Balineni Srinivasareddy

By

Published : Jan 5, 2022, 4:53 PM IST

Minister Balineni Srinivasa Reddy on YS Sharmila: షర్మిలమ్మ మా వైఎస్ కుటుంబ సభ్యురాలు, మేమంతా ఒక్కటే.. అని రాష్ట్ర విద్యుత్తు శాఖామంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో షర్మిల పార్టీ పెట్టడం గురించి చేసిన వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు.

ఎవరో అడిగిన ప్రశ్నకు.. ఆంధ్రలో పార్టీ పెడితే తప్పేమిటని ఆమె అన్నారే తప్ప.. పార్టీ పెడతామని చెప్పలేదని బాలినేని అన్నారు. ఒంగోలులో విలేకరులతో మాట్లాడిన మంత్రి.. ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన.. జనరంజకంగా ఉందని మంత్రి అన్నారు. తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని.. ఎన్నికల అవసరం కోసం ఇతర పార్టీల మీద ఆధారపడి పొత్తుల కోసం చంద్రబాబు ఎదురు చూస్తున్నారని ఎద్దేవా చేశారు.

తమ పార్టీ ఎప్పుడూ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్ఫష్టం చేశారు. గతంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా.. అధినేత సోనియా గాంధీని ఎదిరించి నిలబడిన వ్యక్తి జగన్​ అని అన్నారు.

ఇదీ చదవండి..

NEERUKONDA ON AMRAVATI CORPORATION : అమరావతి కార్పొరేషన్​లో కలవబోమన్న నీరుకొండ వాసులు

ABOUT THE AUTHOR

...view details