ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చీరాలలో లాక్​డౌన్​.. ఉదయం 10 తర్వాత అన్నీ బంద్​ - lock down news in prakasam district

ప్రకాశం జిల్లా చీరాలలో లాక్​డౌన్ కొనసాగుతోంది. కరోనా వ్యాప్తి నివారణకు ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఉదయం 10 గంటల తర్వాత రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. అనవసరంగా బయటకు వస్తే వాహనాలు సీజ్​ చేస్తామని పోలీసులు హెచ్చరించారు. ​

చీరాలలో కొనసాగుతున్న లాక్​డౌన్​
చీరాలలో కొనసాగుతున్న లాక్​డౌన్​

By

Published : Apr 9, 2020, 10:10 AM IST

లాక్​డౌన్ కారణంగా ప్రకాశం జిల్లా చీరాలలో నగర వాసులు ఇళ్లకే పరిమితమవుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే రైల్వేస్టేషన్ రోడ్డు, గడియార స్తంభం, పేరాల కూడలి జనసంచారం లేక వెలవెల బోతున్నాయి. ఉదయం 6 గంటల నుంచి 10 గంటలలోపే నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయాలని అధికారులు నిబంధన విధించడం వల్ల 10 దాటిన తర్వాత రహదారులు నిర్మానుష్యంగా ఉంటున్నాయి. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details