ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చేయడానికి పని లేదు... తినడానికి తిండి లేదు... - prakasham district latest news

ఇచ్చిన పని నెలరోజుల్లో పూర్తైంది. మిగతా రోజులు ఇతర పనులకు వెళ్దామంటే లాక్​డౌన్‌ వల్ల ఎటూపోలేని పరిస్థితి. కరవు జిల్లాలో వ్యవసాయ పనుల్లేవు. వలసలు వెళ్లడానికీ పరిస్థితులు అనుకూలించడంలేదు. పని లేక, ఆదాయం లేక అప్పులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు ప్రకాశం జిల్లా కూలీలు.

Lock Down Effect on Labor in Prakasham District
లాక్​డౌన్ ఎఫెక్ట్.. కూలీల బాధ వర్ణాణాతీతం

By

Published : Sep 24, 2020, 6:06 PM IST

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గ్రామీణ ప్రాంత కూలీలకు వేసవిలో ఇతర పనులు లేని పరిస్థితిలో పనులు చూపించి, ఉపాధి కల్పించాలి. ప్రతీ ఏటా కూలీలు ఎంతో కొంత ఉపాధితో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. 100 రోజులు పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఇరత వ్యవసాయ, నిర్మాణ పనులకు వెళ్లి జీవనం సాగించేవారు. జాబ్‌ కార్డు ఉన్న కుటుంబానికి 100రోజులు చొప్పున పని కల్పించడం కేంద్ర ప్రభుత్వ లక్ష్యం.

అయితే కుటుంబంలో ఇద్దరు, లేదా ముగ్గురు పనిచేసుకుంటే అదే వందరోజులను వాటాలుగా వేసుకొంటారు. అంటే ముగ్గురున్న కుటుంబానికి దాదాపు నెలరోజులే పని ఉంటుంది. మిగతా సమయంలో ఖాళీగా ఉండాల్సిందే. ఇది నిబంధనయినా కష్టపడ్డానికి ఓపిక, అవకాశం ఉన్నా మిగతా రోజులు జీవనానికి వేరే పనులు చూసుకోవాల్సింది.

ఈ ఏడాది కూడా అదే నిబంధనతో ఏప్రిల్‌ నుంచి దాదాపు 100రోజుల పని రెండునెలలకే పూర్తైన కుటుంబాలు ఉన్నాయి. అయితే ప్రతీ సంవత్సరంలా కాకుండా ఈ ఏడాది పరిస్థితి భిన్నంగా ఉంది. కొవిడ్‌ కారణంగా లాక్‌ డౌన్‌ అమలు వల్ల ఇతర పనులకు ఎలాంటి అవకాశం లేకుండా పోయింది. దీంతో ఉపాధి హమీ పనులు పూర్తి చేసుకున్న తరువాత లౌక్‌ డౌన్‌ కారణంగా పనుల్లేక ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రకాశం జల్లాలో దాదాపు 683 కోట్ల రూపాయల పనులు చేపట్టారు. 4.77లక్షల మందికి జాబ్‌ కార్డులుండగా ఇందులో 37వేల కుటుంబాలు 100 రోజులు పూర్తి చేసుకున్నారు. మిగిలిన వారు ఇంకా 100 రోజులు పూర్తి కాని కుటుంబాలుగా ఉన్నాయి. మిగిలిన రోజులు పనులు చేసుకోడానికి అవకాశం ఉన్నా, ఒక ముఠాలో మిగిలిన కొద్ది మందితో పనులు చేయడానికి అంత సుముఖత కనిపించడంలేదు.

జిల్లాలో ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కరవు జిల్లాలో వర్షాలు అంతగా కురవకపోవడంతో వ్యవసాయ పనులు జరగడంలేదు. కొన్ని మండలాలు మినహా మిగితా మండలాల్లో ఇప్పటికీ వ్యవసాయ పనులు సాగక పొలాలన్ని బీళ్లుగా మారిపోయాయి. నారుమళ్ళు వేసినా, వర్షాలు లేక ఎండిపోయిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి స్థితిలో వ్యవసాయ పనులు సాగడం కూడా కష్టమే. వ్యవసాయ పనులున్నా లాక్‌డౌన్‌ నిబంధనలను అనుసరించి కూలీ పనులు చేసుకునేవారమని, ఆ అవకాశం కూడా లేకుండా పోయిందంటున్నారు కూలీలు.

ఇతర జిల్లాలకు వలసలు పోయి అక్కడ పనిచేసుకుందామనుకున్నా.. రానివ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత లాక్‌ డౌన్‌ పరిస్థితుల్లో మరో 50 రోజులు పాటు ఉపాధి కల్పించాలని కోరుతున్నారు.

ఇదీ చదవండీ... శ్రీవారి సేవలో ముఖ్యమంత్రులు జగన్, యడియూరప్ప

ABOUT THE AUTHOR

...view details