ప్రకాశం జిల్లా డీపీఆర్వో ఏడీ నారాయణరెడ్డిపై వచ్చిన ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది. విజయవాడ నుంచి వచ్చిన జాయింట్ డైరెక్టర్ కస్తూరి, అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసరావు, ఏడీ వీరభద్రం బృందం విచారణ నిర్వహిస్తోంది. కొంతకాలంగా తమతో అసభ్యంగా ప్రవర్తిస్తూ వ్యక్తిగత వివరాల గురించి వ్యంగ్యంగా మాట్లాడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని జిల్లా సమాచార శాఖలో విధులు నిర్వహిస్తున్న కింది స్థాయి మహిళ ఉద్యోగులు.. కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీనిపై సమాచార శాఖ కమిషనర్ విచారణకు ఆదేశించారు. విచారణ బృందం ఒంగోలు కార్యాలయంలో విచారణ చేపట్టింది.
డీపీఆర్వో ఏడి నారాయణరెడ్డిపై వచ్చిన ఆరోపణలపై విచారణ - డీపీఆర్ఓ ఏడి నారాయణ రెడ్డిపై వచ్చిన ఆరోపణలపై విచారణ
ప్రకాశం జిల్లా డీపీఆర్వో ఏడీ నారాయణరెడ్డిపై వచ్చిన ఆరోపణలపై విజయవాడ నుంచి జాయింట్ డైరెక్టర్ కస్తూరి, అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసరావు, ఏడీ వీరభద్రం బృందం విచారణ నిర్వహించింది.
![డీపీఆర్వో ఏడి నారాయణరెడ్డిపై వచ్చిన ఆరోపణలపై విచారణ Inquiry into allegations against DPRO Adi Narayana Reddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10296038-849-10296038-1611044302873.jpg)
డీపీఆర్ఓ ఏడి నారాయణ రెడ్డిపై వచ్చిన ఆరోపణలపై విచారణ