ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రకాశంలో పెరుగుతున్న కరోనా..  అప్రమత్తమైన అధికారులు

By

Published : Jun 16, 2020, 3:03 PM IST

ప్రకాశం జిల్లా చీరాలతో పాటు పలు ప్రాంతాల్లో కరోనా పాజిటివ్​ కేసులు పెరుగుతున్న కారణంగా అధికారులు అప్రమత్తమయ్యారు. జయంతి పేటలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఇద్దరు సచివాలయ సిబ్బందిని చీరాల మున్సిపల్ కమిషనర్ రామచంద్రా రెడ్డి సస్పెడ్ చేశారు.

increased corona cases in cheerala
ప్రకాశంలో పెరుగుతున్న కరోనా అప్రమత్తమైన అధికారులు

ప్రకాశం జిల్లా చీరాలలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పట్టణంలోని జయంతిపేట, గొల్లపాలెం ప్రాంతాల్లో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు దుకాణాలను మూసి వేయించారు. ఇతర ప్రాంతాల నుంచి పట్టణంలోకి రాకుండా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో రహదారులకు అడ్డంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు.

ABOUT THE AUTHOR

...view details