ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా వేళ.. కరిగిపోతున్న కొండ - పోతవరం వద్ద కొండ మట్టి అక్రమ తవ్వకాల వార్తలు

ప్రకాశం జిల్లా పోతవరం వద్ద ఉన్న కొండను కొందరు అక్రమార్కులు తొలిచేస్తున్నారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా కొండ మట్టిని తరలిస్తున్నారు. దీనిపై స్పందించిన తహసీల్దారు.. ఆ ప్రాంతాన్ని పరిశీలించి అక్రమదారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

hill clay illegal transport in pothavaram in prakasam district
పోతవరం వద్ద అక్రమంగా మట్టి తవ్వకాలు

By

Published : Jun 25, 2020, 3:29 PM IST

కరోనా.. సామాన్య ప్రజలను ఇబ్బందులు పెడుతుంటే.. అక్రమార్కులకు మాత్రం అది వరంగా మారింది. జనం ఎవరూ బయట తిరగని వేళ యథేచ్ఛగా, ఎటువంటి అనుమతులు లేకుండా మట్టి తవ్వుతున్నారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం పోతవరం వద్ద ఉన్న కొండను తొలిచేస్తున్నారు. కొంతమంది కొండ మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. మట్టి ట్రాక్టర్లు రెవెన్యూ కార్యాలయం ముందు నుంచే వెళ్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు అంటున్నారు.

దీనిపై దర్శి మండల తహసీల్దారుని ఫోనులో వివరణ కోరగా.. మట్టి తవ్వకాలకు ఎవరికీ ఎటువంటి అనుమతులు లేవన్నారు. మట్టి తవ్వుతున్న కొండ ప్రాంతాన్ని పరిశీలించి.. అనధికార తవ్వకాలు జరిపే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఇవీ చదవండి..: ఆ లారీ తల తెగింది... అయినా దూసుకెళ్తోంది..!

ABOUT THE AUTHOR

...view details