ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'కరోనాపై అప్రమత్తంగా ఉండండి.. ప్రజలకు అవగాహన కలిగించండి'

By

Published : Jun 20, 2020, 11:36 AM IST

ప్రకాశం జిల్లాలో 60 ఏళ్లు నిండిన వృద్ధులకు కరోనా పరీక్షలు చేయాలని ఉన్నతాధికారులు సిబ్బందికి సూచించారు.

health team meeting
కరోనాపై పోరుకు వైద్య సిబ్బంది సమావేశం

కరోనా పాజిటివ్ కేసులు వేగంగా నమోదవుతున్న కారణంగా వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ప్రకాశం జిల్లా చినగంజాం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు విజయ భాస్కరరావు సూచించారు. వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలకు కీలక సూచనలు చేశారు.

మండలంలోని ఇంటింటికీ వెళ్లి కరోనాపై అవగాహన కలిగించాలన్నారు. ప్రతి ఒక్కరూ శానిటైజర్, మాస్కులు తప్పనిసరిగా వాడే విధంగా ప్రజలకు చెప్పాలని స్పష్టం చేశారు. వైరస్ వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించాలని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details