ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పార్కింగ్​​ చేసిన కారులో చోరీ.. 4 కిలోల బంగారం అపహరణ - పార్కింగ్​​ చేసిన కారులో 4 కిలోల బంగారం..

పార్కింగ్​ చేసిన కారులో 4 కిలోల బంగారు బిస్కెట్లు, నగదును డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన సికింద్రాబాద్​లోని ఈస్ట్​ మారేడ్​పల్లిలో జరిగింది.

పార్కింగ్​​ చేసిన కారులో 4 కిలోల బంగారం, నగదు

By

Published : Nov 24, 2019, 11:30 AM IST

పార్కింగ్​​ చేసిన కారులో చోరీ.. 4 కిలోల బంగారం అపహరణ

తెలంగాణలోని సికింద్రాబాద్​ ఈస్ట్​ మారేడ్​పల్లిలో ఓ నర్సింగ్​ హోం వద్ద పార్కు చేసిన కారులో 40 బంగారు బిస్కెట్లు, నగదును డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా కోల్​కతా నుంచి మైసూర్​ మీదుగా హైదరాబాద్​కు​ బంగారాన్ని తరలించినట్లు ఒప్పుకున్నారు. పట్టుబడిన నిందితులు ముగ్గురూ హైదరాబాద్​వాసులే.

బంగారాన్ని విదేశాల నుంచి తీసుకొని ఎవరెవరికి విక్రయిస్తున్నారనే దానికి సంబంధించి డీఆర్ఐ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం, నగదుకు ఎలాంటి ధ్రువపత్రాలు లేవని.. వారిని విచారిస్తున్నట్లు డీఆర్ఐ అధికారులు తెలిపారు. బంగారం విలువ కోటి 95 లక్షల రూపాయల వరకు ఉంటుందని.. ఈ పుత్తడి ఎవరికి సంబంధించినదనే విషయాన్ని పోలీసులు ఆరా తీస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details