ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 24, 2020, 7:21 AM IST

Updated : May 24, 2020, 9:13 AM IST

ETV Bharat / state

ప్రేమపేరుతో బాలికపై సామూహిక అత్యాచారం

తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన ఓ బాలికపై ప్రకాశం జిల్లా చీమకుర్తిలో సామూహిక అత్యాచారం జరిగింది. బాధిత బాలిక భయపడి వారి నుంచి తప్పించుకుని ఒంగోలుకు చేకుకుంది. అధికారులు క్వారంటైన్​కు తరలించగా విషయం వెలుగులోకి వచ్చింది.

girl gang rape
బాలికపై సామూహిక అత్యాచారం

ప్రేమ పేరుతో ప్రకాశం జిల్లా చీమకుర్తిలో బాలికపై కలిసి సామూహిక అత్యాచారం జరిగింది. చీమకుర్తికి చెందిన రామయ్య తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు బేల్దార్​ పనులకు వెళ్లాడు. అక్కడ ఓ బాలికను ప్రేమిస్తున్నానని నమ్మించి చీమకుర్తి తీసుకొచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. 20 రోజులుగా బాలికను వేధిస్తూ అసభ్యకరంగా వీడియోలు తీశాడు. తన స్నహితులతో సన్నిహితంగా మెలగాలని వేధించాడు. ఆ తర్వాత నలుగురు స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. భయపడిన బాలిక వారి నుంచి తప్పించుకుని ఒంగోలు చేరుకుంది. అక్కడ క్వారంటైన్​కు తరలించారు. అక్కడ విచారించగా అత్యాచారం ఘటన వెలుగులోకి వచ్చింది. అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

Last Updated : May 24, 2020, 9:13 AM IST

ABOUT THE AUTHOR

...view details