ప్రకాశం జిల్లా గిద్దలూరులో లాక్డౌన్ అమలును డ్రోన్ కెమెరాల నిఘాలో పోలీసులు సమీక్షిస్తున్నారు. పట్టణంలో అన్ని ప్రధాన వీధులు, రహదారుల్లో లాక్డౌన్ ఏవిధంగా జరుగుతున్నదో తెలుసుకోవడానికి డ్రోన్ కెమెరాలను వాడుతున్నారు. నిత్యావసర వస్తువుల కొనుగోలుకు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు మాత్రమే అనుమతించడం జరిగిందని ఎస్సై సమందర్ తెలిపారు. సమయం ముగిసిన తర్వాత ఎవరూ అనవసరంగా... ద్విచక్ర వాహనాలతో రోడ్ల మీదికి రావొద్దని చెప్పారు.
డ్రోన్ కెమెరా నిఘాలో గిద్దలూరు - lockdown in Giddhaluru
డ్రోన్ కెమెరా సహాయంతో ప్రకాశం జిల్లా గిద్దలూరులో.. లాక్డౌన్ అమలును అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
![డ్రోన్ కెమెరా నిఘాలో గిద్దలూరు Giddhaluru in drone camera surveillance](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6738291-612-6738291-1586519877182.jpg)
డ్రోన్ కెమెరా నిఘాలో గిద్దలూరు