ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గిద్దలూరు పాఠశాలను సందర్శించిన పశ్చిమ్​ బంగ అదనపు డీజీపీ

ప్రకాశం జిల్లా గిద్దలూరులోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను... పశ్చిమ్ బంగ అదనపు డీజీపీ సందర్శించారు. గిద్దలూరు ఎందుకు వచ్చారో... ఆ పాఠశాలను ఎందుకు సందర్శించారో మీరూ తెలుసుకోండి.

By

Published : Jan 31, 2020, 8:10 PM IST

Published : Jan 31, 2020, 8:10 PM IST

additional dgp of west benagal in giddaluru
గిద్దలూరు పాఠశాలను సందర్శించిన పశ్చిమ బంగ అదనపు డీజీపీ

గిద్దలూరు పాఠశాలను సందర్శించిన పశ్చిమ్​ బంగ అదనపు డీజీపీ

పశ్చిమ్ బంగ అదనపు డీజీపీ నాగ రమేష్... ప్రకాశం జిల్లా గిద్దలూరులోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థే. 1974వ సంవత్సరంలో పాఠశాలలో చదువుకున్న నాగ రమేష్... అప్పటి తన మిత్రులతో కలిసి పాఠశాలను సందర్శించారు. వారికి చదువులు చెప్పిన గురువులను ఘనంగా సత్కరించారు. మిత్రుల మధ్య బేధాలు, హెచ్చుతగ్గులు ఉండకూడదనీ... ఏ స్థాయిలో ఉన్నా అందరూ సమానులేనని ఈ సందర్భంగా నాగ రమేష్ విద్యార్థులకు వివరించారు. ఉద్యోగం అనే పదాన్ని విద్యార్థులకు వివరించారు. 10వ తరగతిలో మంచి మార్కులు సాధించాలంటే... ఒకటో తరగతి నుంచే కష్టపడి చదవాలని సూచించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details