మున్సిపల్ ఎన్నికల్లో ప్రకాశం జిల్లా అద్దంకి నాలుగో వార్డు సీపీఎం, సీపీఐ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి తంగిరాల రజిని ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తమ ఎన్నికల గుర్తు సుత్తి కొడవలి నక్షత్రానికి ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు కాకర్ల వెంకటేశ్వర్లు, పార్టీ జిల్లా నాయకులు వి. బాలకోటయ్య, ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు ఎం. చక్రవర్తి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
జిల్లాలోని పలు వార్డుల్లో తెదేపా తరపున కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేసిన వారికి మద్దతుగా అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అవినీతి రహిత సమాజం కావాలన్నా, పట్టణంలోని తాగునీరు డ్రైనేజ్ వంటి ప్రధాన సమస్యలు తొలగిపోవాలంటే సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.