ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్యం దుకాణంలో చోరీకి పాల్పడిన దొంగల అరెస్ట్ - ప్రకాశం జిల్లా జంగాలపల్లిలో మద్యం దుకాణంలో చోరీ

ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలంలో జరిగిన పలు చోరీ కేసులను పోలీసులు ఛేదించారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రెండు వందల మద్యం బాటిళ్లు, బంగారం సరుడు, డబ్బు స్వాధీనం చేసుకున్నట్లు మర్రిపూడి ఎస్సై సుబ్బారాజు తెలిపారు.

four members arrested for liquor store robbery case
మద్యం దుకాణంలో చోరీకి పాల్పడ్డ దొంగలు అరెస్ట్

By

Published : Dec 15, 2020, 7:38 AM IST

ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం జంగాలపల్లిలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రెండు వందల మద్యం బాటిళ్లు, బంగారం సరుడు, 71 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు మర్రిపూడి ఎస్సై సుబ్బారాజు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఎస్సై సుబ్బారాజు వెల్లడించారు.

ఈనెల 7న రాత్రి జంగాలపల్లిలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీ జరిగినట్లు ఫిర్యాదు వచ్చింది. ఈ మేరకు మండలంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నాం. అనుమానాస్పదంగా ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకొని విచారించగా.. మద్యం దుకాణంలో చోరీతో పాటు పొదిలి, కొనకలమిట్ల, మర్రిపూడి మండలాల్లో పలు దొంగతనాలు చేసినట్లు అంగీకరించినట్లు ఎస్సై తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details