ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆడపిల్ల పుట్టిందని ఇంట్లో గొడవ.. ఇంతలో పాప అనుమానాస్పద మృతి.. - ప్రకాశంలో పసిపాప మృతి వార్తలు

ఆ పసిపాప పుట్టి ఇంకా ఐదు రోజులు కూడా గడవకముందే.. కానరాని లోకాలకు వెళ్లిపోయి తల్లిదండ్రులకు పుట్టెడు శోకాన్ని మిగిల్చింది. మహాలక్ష్మి పుట్టిందని ఓ వైపు తల్లిదండ్రులు సంతోషిస్తుంటే.. నానమ్మ మాత్రం ఆడపిల్ల వద్దని గొడవకు దిగింది. నాలుగు రోజుల క్రితం ఒంగోలులోని మాతాశిశు వైద్యశాలలో ఓ ఆడపిల్ల అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఆ పసిపాపను నానమ్మే చంపి ఉంటుందని కుటుంబసభ్యులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

four days old baby suspicious death in prakasam
ప్రకాశంలో అనుమానస్పద స్థితిలో నాలుగు రోజుల చిన్నారి మృతి

By

Published : Dec 18, 2020, 5:44 PM IST

Updated : Dec 18, 2020, 6:35 PM IST

ప్రకాశంలో అనుమానస్పద స్థితిలో నాలుగు రోజుల చిన్నారి మృతి

ప్రకాశం జిల్లా ఒంగోలులోని మాతాశిశు వైద్యశాలలో నాలుగురోజుల క్రితం ఓ ఆడపిల్ల అనుమానాస్పదస్థితితో మృతిచెందింది. జిల్లాలోని ఇంకుల్లు మండలం హునుమాజిపాలెంకు చెందిన కీర్తన.. ఈ నెల 14న ఆడపిల్లకు జన్మనిచ్చింది. అమ్మాయి పుట్టిందని.. నాన్నమ్మ యేసమ్మ కోడలిని, కుమారుడిని వేధించడం ప్రారంభించింది. ఆడపిల్ల వద్దంటూ రోజూ కుమారుడితో గొడవ పడుతుందని కుటుంబసభ్యులు తెలిపారు.

గురువారం రాత్రి తన దగ్గర నుంచి యేసమ్మ పాపను బయటకు తీసుకువెళ్లి, కొంత సమయం తరువాత తీసుకువచ్చిందని కీర్తన తెలిపింది. అపస్మారక స్థితిలో ఉన్న శిశువును చూసి కంగారుపడి...తన తల్లికి చెప్పినట్టు పేర్కొంది. వాళ్లు వచ్చి పాపను వైద్యులకు చూపించారు. వారు పరీక్షలు చేసి శిశువు మృతి చెందినట్లు తేల్చారు. ఆడపిల్ల పుట్టిందని నానమ్మే చంపేసిందంటూ.. చిన్నారి బంధువులు ఆరోపిస్తున్నారు.

శిశువు మృతి విషయంలో యేసమ్మను ప్రశ్నించగా.. పొంతనలేని సమాధానం చెప్పింది. తర్వాత కనిపించకుండా ఎటో వెళ్లిపోయింది. ఆడపిల్ల పుట్టిందని యేసమ్మే హత్య చేసి ఉంటుందని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. కీర్తన తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ఇదీ చదవండి:

వృద్ధ దంపతుల హత్య కేసులో వాలంటీర్​ అరెస్ట్

Last Updated : Dec 18, 2020, 6:35 PM IST

ABOUT THE AUTHOR

...view details