ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 10, 2020, 1:32 PM IST

ETV Bharat / state

కొడుకు మరణాన్ని తట్టుకోలేక తండ్రి మృతి

కరోనాతో కుమారుడు మృతి చెందడాన్ని తట్టుకోలేక తండ్రి గుండెపోటుతో చనిపోయిన ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో జరిగింది.

father died unable to bear the death of the son
కొడుకు మరణాన్ని తట్టుకోలేక తండ్రి మృతి

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొడుకు మరణ వార్త విని తండ్రి గుండెపోటుతో మృతి చెందాడు. మార్కాపురంకు చెందిన వ్యక్తికి ఇటీవల కరోనా సోకి ఒంగోలు రీమ్స్​లో చేరాడు. పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. అయితే...కుమారుడి మరనాన్ని తట్టుకోలేని తండ్రి సత్తార్ బేగం గుండె పోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడు మార్కాపురం నియోజక ఓ మాజీ ఎమ్మెల్యేకు వ్యక్తి గత సహాయకునిగా ఉండేవారు. తండ్రి సత్తార్ బేగం విశ్రాంత మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా పనిచేశారు. వీరి కుటుంబానికి ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి సానుభూతి తెలిపారు.

ఇదీ చదవండి:

ఏపీ ఎంసెట్‌ ఫలితాలు విడుదల

ABOUT THE AUTHOR

...view details