property dispute: ప్రకాశం జిల్లా అద్దంకి మండలం ధర్మవరంలో ఆస్తి వివాదం.. రెండు నిండు ప్రాణాలు బలితీసుకుంది. గత కొన్ని రోజులుగా ఆస్తి కోసం కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం తండ్రి, కొడుకులు మరోసారి గొడవపడ్డారు. తండ్రి సీతారామయ్యను.. కుమారుడు శంకర్రావు ఇనుప రాడ్డుతో దాడి చేసి హతమార్చాడు.
property dispute: ఆసరా అవుతుందనుకుంటే.. ఆయువు తీసింది - ప్రకాశం జిల్లా లేటెస్ట్ అప్డేట్
property dispute: అండగా ఉంటుందనుకుంటే ఆయువు తీసింది..! ఆసరా అవుతుందనుకుంటే పచ్చని కుటుంబంలో చిచ్చు పెట్టింది..! ఒడిదుడుకుల్లో ఒడ్డుకు చేరుస్తుందనుకుంటే.. రెండు నిండు ప్రాణాలను నిర్జీవంగా మార్చింది..! భవిష్యత్తు చూపిస్తుందనుకుంటే ఒకరి ప్రాణాన్ని తీయించి, మరొకరిని ఆత్మహత్యకు ప్రేరేపించింది..! అదే ఆస్తి అనే అందమైన పదం. అద్దంకి మండలం ధర్మవరంలో ఆస్తి వివాదం తండ్రికొడుకులను బలితీసుకుంది. అసలేం జరిగిందంటే..?
ఆస్తి వివాదంలో ఇద్దరు బలి
అనంతరం ఇంట్లో ఉరి వేసుకొని.. కుమారుడు శంకర్రావు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒకే కుటుంబానికి చెందిన ఇరువురు మృతి చెందడంతో బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:కట్టుకున్నవాడే కడతేర్చాడు.. కారణం అదేనా..?