ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించాలి: మంత్రి సురేశ్

By

Published : Apr 4, 2020, 10:05 AM IST

రోజురోజుకు కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతకు పాధాన్యతనివ్వటంతో పాటు సామాజిక దూరాన్ని పాటించాలని మంత్రి సురేశ్ స్పష్టం చేశారు.

ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించాలి
ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించాలి

లాక్​డౌన్ నేపథ్యంలో నిర్ణీత ధరలకే కూరగాయులు, పండ్లు విక్రయించాలని మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్​ను ఆయన పరిశీలించారు. కరోనా వైరస్ విజృభిస్తుంన్నందున... ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించాలని సూచించారు. విక్రయదారులకు మాస్కులను పంపిణీ చేశారు. కూరగాయలు, పండ్ల ధరలు తెలుసుకున్న మంత్రి...వారికి ఎదురవుతున్న సమస్యలను అడిగితెలుసుకున్నారు.

ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించాలి: మంత్రి సురేశ్

ABOUT THE AUTHOR

...view details