విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీలో నామినేషన్ల ఘట్టం ముగియడంతో వివిధ పార్టీల అభ్యర్థులు ప్రచారాల్లో నిమగ్నమవుతున్నారు. పట్టణంలో 28వార్డుకు 78 బరిలో ఉన్నారు. ఇక్కడ తెదేపా, వైకాపా అన్ని వార్డుల్లో తమ అభ్యర్థులను బరిలో నిలపగా.. జనసేన మూడు వార్డులు, భాజపా ఎనిమిది, సీపీఎం ఇద్దరిని పోటీలో ఉంచింది. తెదేపా మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సతీమణి పద్మావతి, ఆయన కుమారుడు రాజేష్ కౌన్సిలర్లుగా పోటీ చేస్తున్నారు. అయ్యన్నపాత్రుడికి, అధికార పార్టీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్కు మున్సిపాలిటీ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి.
అద్దంకిలో ఎమ్మెల్యే ఇంటింటి ప్రచారం..