ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కరోనా ఎఫెక్ట్ : ప్రకాశంలో అధికారుల అప్రమత్తం

By

Published : Apr 6, 2020, 2:25 PM IST

ప్రకాశం జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులతో.. జిల్లా యంత్రంగా అప్రమత్తమయ్యింది. ఈ మేరకు జిల్లాలో తీసుకోవల్సిన చర్యపై.. జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. ఏప్రిల్​ 14 వరకూ లాక్​డౌన్​ని కఠినంగా అమలు చేయాలని సూచించారు.​

due to corona prakasham district Collector Paola Bhaskar  meeting with officials for lockdown
due to corona prakasham district Collector Paola Bhaskar meeting with officials for lockdown

ప్రకాశం జిల్లా చీరాలలో లాక్​డౌన్​ను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. చీరాల, కుంకలమర్రులో ఆదివారం కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమయింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ కారంచేడులోని అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 14 వరకూ లాక్​డౌన్​ని కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచించారు. కర్ఫ్యూకి ప్రజలంతా సహకరించాలని చీరాల సీఐ ఎన్. నాగమల్లేశ్వరరావు కోరారు. అనవసరంగా ఎవరైనా రహదార్లపైకి వస్తే వాహనాలను జప్తు చేస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం జిల్లాలో 23 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details