ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కరోనా ఎఫెక్ట్: నిండు గర్భిణి గోడు

By

Published : May 3, 2020, 5:01 PM IST

కరోనా లాక్​డౌన్​ కారణంగా గర్భిణులు తీవ్ర అగచాట్లు పడుతున్నారు. చివరకు ప్రసవం కోసం వెళ్లినా ఆసుపత్రిలో చేర్చుకోవడం లేదు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కనిగిరిలో జరిగింది.

due to corona lockdown Pregnant facing lot of problems in kanigiri in prakasham
due to corona lockdown Pregnant facing lot of problems in kanigiri in prakasham

ప్రకాశం జిల్లా వేలిగండ్ల మండలం కొట్టాలపల్లిలో ఓ నిండు గర్భిణి పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఇండ్ల మానస అనే మహిళ ప్రసూతి కోసం కనిగిరిలో తిరగని వైద్యశాల లేదు. ప్రభుత్వ, ప్రైవేట్ అని తేడా లేకుండా కనిపించిన ప్రతీ వైద్యశాలకు వెళ్లింది. కరోనా లాక్​డౌన్ కారణంగా వెళ్లిన చోటల్లా ఒకటే సమాధానం. ఈ వైద్యశాలలో మేము చేర్చుకోం అని.

నిస్సహాయ స్థితిలో.. దిక్కుతోచక బిక్కు బిక్కుమంటూ పామూరు బస్​స్టాండ్ సమీపములో ఆమె దిక్కులు చూస్తూ కూర్చుంది. చివరి ప్రయత్నంగా తన గోడును ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్​కు వినిపించింది. స్పందించిన ఎమ్మెల్యే... ప్రభుత్వ వైద్యశాల సిబ్బందిని అప్రమత్తం చేశారు. బాధితురాలుని ఆసుపత్రిలో చేర్చిచి.. చికిత్సనందించారు.

ABOUT THE AUTHOR

...view details