ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గిద్దలూరులో స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ - due to corona Janata curfew continues at giddhaluru

గిద్దలూరులో జనతా కర్ఫ్యూ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రజలు ఇళ్లలోనే స్వచ్ఛందంగా కర్ఫ్యూని కొనసాగిస్తున్నారు. ఈ మేరకు వీధులన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి.

due to corona Janata curfew continues at giddhaluru in prakasham district
due to corona Janata curfew continues at giddhaluru in prakasham district

By

Published : Mar 23, 2020, 6:32 AM IST

ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు కరోనా వైరస్​ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రజలు జనతా కర్ఫ్యూను పాటిస్తున్నారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. గాంధీ బొమ్మ సెంటర్, వైఎస్సార్ సెంటర్​, బస్, రైల్వే స్టేషన్, అమ్మవారి శాల వీధి, పొట్టి శ్రీరాములు సెంటర్లు జనాలు లేక నిశ్శబ్దంగా మారాయి. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. బంగారం, వస్త్ర, వ్యాపార దుకాణాలను మూసివేశారు.

గిద్దలూరులో స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ

ABOUT THE AUTHOR

...view details