పంచాయతీ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో.. ప్రకాశం జిల్లా చీరాల మండల గ్రామాల ప్రజలతో డీఎస్పీ శ్రీకాంత్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. శాంతి భద్రతల పరిరక్షణకు గ్రామస్థులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చీరాల రూరల్ సీఐ రోశయ్య, ఈపూరపాలెం ఎస్సై సుబ్బారావు పాల్గొన్నారు.
'శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలంతా సహకరించాలి'
ప్రకాశం జిల్లా చీరాల మండలంలోని గ్రామాల ప్రజలతో డీఎస్పీ శ్రీకాంత్ సమావేశం నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా గ్రామస్థులకు పలు సూచనలు చేశారు.
చీరాల మండలంలోని గ్రామాల ప్రజలతో డీఎస్పీ సమావేశం
ఇదీ చదవండి:
వాలంటీర్లు వద్దు.. వారిని పంచాయతీ ఎన్నికలకు దూరంగా పెట్టండి: ఎస్ఈసీ