ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పేదలకు ఆహారం.. పోలీసులకు శానిటైజర్ల విరాళం

By

Published : Apr 23, 2020, 12:22 PM IST

లాక్ డౌన్ కారణంగా పేదలు ఇబ్బందులు పడుతున్నారు. వారికి ఆహారం దొరకడం కూడా కష్టంగా మారింది. ఇలాంటి వారిని ఆదుకునేందుకు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి.

donors come forward in different places to serve people in prakasam district
ప్రకాశం జిల్లాలో ప్రజలు సహాయం అందిస్తున్న దాతలు

చీరాలలో పేదలను ఆదుకునేందుకు పూర్వ విద్యార్థులను ముందుకు వచ్చారు. విజయలక్ష్మి కాన్వెంట్​లో​ 1992 - 93 సంవత్సరంలో చదువుకున్న విద్యార్థులు.. చీరాలు ఫైర్ కార్యాలయం గేటు సమీపంలో నివసించే 50 పేద కుటుంబాలకు కూరగాయలు, పాలు, వంటనూనె పంపిణీ చేశారు. లాక్​డౌన్​ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదల కష్టాలు చూడలేక తమ వంతు సాయం అందించామని పూర్వ విద్యార్థుల సంఘం ప్రతినిధి చందు తెలిపారు.

గిద్దలూరు మండలంలో లాక్​డౌన్​ నిధులు నిర్వహిస్తున్న పోలీస్​ సిబ్బందికి, పాత్రికేయులకు శానిటైజర్లు, మాస్కులను ఉపాధ్యాయులు పిచ్చయ్య పంపిణీ చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details