ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రత్యేక పూజలతో ప్రకాశించిన శైవక్షేత్రాలు - కార్తీకమాసంలో ప్రకాశం జిల్లా శివాలయంలో ప్రత్యేక పూజలు తాజా వార్తలు

ప్రకాశం జిల్లాలోని శివాలయాలన్నీ భక్తులకు కిక్కిరిశాయి. కార్తికమాసం మొదటి సోమవారం కావడం ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు. తెల్లవారుజాము నుంచి అభిషేకాలు, రుద్రాభిషేకాలు నిర్వహించి సర్వేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు.

divoties grand celebrations karthika masam
ప్రత్యేక పూజలతో ప్రకాశించిన శైవక్షేత్రాలు

By

Published : Nov 16, 2020, 11:11 AM IST

కార్తికమాసం మొదటి సోమవారం సందర్భంగా భక్తులు శివాలయాలకు భారీగా తరలివచ్చారు. ప్రకాశం జిల్లా చినగంజాం మండలంలోని శివాలయాల్లో స్వామివారికి అభిషేకాలు, రుద్రాభిషేకాలు నిర్వహించారు. సోపిరాలలోని శివాలయంలో తెల్లవారుజాము నుంచే శివదర్శనం కోసం భక్తులు బారులు తీరారు. అలయ ప్రాంగణంలో ఉన్న జమ్మిచెట్టు వద్ద మహిళలు కార్తిక దీపాలు వెలిగించారు. అయ్యప్పస్వామి దేవాలయంలో కార్తికమాసాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

పేరాలలోని పురాతన శ్రీ పునుగు రామలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో శివదర్శనం కోసం భక్తులు బారులు తీరారు. చీరాల శివాలయంలో గరళకంఠునికి అభిషేకాలు చేశారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు కార్తిక దీపాలు వెలిగించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు స్వామివారి దర్శనం చేసుకొనేలా ఆలయ పూజారులు ఏర్పాట్లు చేశారు.

పరమశివుడికి ఇష్టమైన సోమవారం రోజు కార్తికమాసం ప్రారంభం కావడంతో ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలోని శైవ క్షేత్రాలన్నీ శివనామస్మరణతో మార్మోగిపోయాయి. తెల్లవారుజామున పవిత్ర స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు కొవిడ్ నియమాలు పాటిస్తూ స్వామి వారిని దర్శించుకొని తీర్ధ ప్రసాదాలు అందుకున్నారు.

ఇవీ చూడండి...

'భూములు లాక్కున్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమే'

ABOUT THE AUTHOR

...view details