ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేదలకు అండగా.. సరుకులు పంచగా - ఏపీలో కరోనా మరణాలు

లాక్​డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకొస్తున్నారు. ప్రకాశం జిల్లా పరిధిలో నిత్యవసర సరుకులు అందిస్తున్నారు.

Distribution of Essential  needs in prakasham district
చీరాలలో ఆహారపోట్లాల పంపిణీ

By

Published : Apr 22, 2020, 7:05 PM IST

చీరాలలో ఆహారపోట్లాల పంపిణీ

లాక్​డౌన్ నేపథ్యంలో పేదలకు దాతలు ఆపన్నహస్తం అందిస్తున్నారు. ప్రకాశం జిల్లా చీరాలలోని రెడ్ జోన్ ప్రాంతమైన నవాబ్​పేటలో రెడ్ క్రాస్ సంస్థ ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. చీరాల ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ జి.సుబ్బారావు ఆధ్వర్యంలో 350 కుటుంబాలకు మసీదు పెద్దలు, వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ ఆహారాన్ని అందించారు.

చీరాలలో అరటి పళ్ల పంపిణీ

అరటి రైతులు నష్ట పోకుండా వారికి గిట్టుబాటు ధర కల్పిస్తూ.. పేదలకు ఉచితంగా అరటి పళ్లను పంచుతున్నారు. ప్రకాశంజిల్లా చీరాలలో మార్కెట్ కమిటీ ద్వారా 50 టన్నుల అరటి పళ్లను ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు వైకాపా నాయకులు కొనుగోలు చేశారు. పట్టణంలోని వార్డుల్లో అరటి పళ్లను పంచారు. మునిసిపల్ కమిషనర్ కె. రామచంద్రరెడ్డి, చీరాల నియోజకవర్గ వైకాపా బాధ్యుడు ఆమంచి కృష్ణ మోహన్, సీఐ నాగమల్లీశ్వరరావు పాల్గొన్నారు.

అద్దంకిలో లెనిన్ జయంతి

అద్దంకి సుందరయ్య భవన్​లో సీపీఎం అధ్యర్యంలో సోవియట్ రష్యా విప్లవ సారధి లెనిన్ 150 వ జయంతి వేడుకలు నిర్వహించారు. చిత్రపటానికి నాయకులు పూలమాలవేసి నివాళులర్పించారు. పేదలకు నిత్యవసర సరకులు అందజేశారు. సీఐటీయూ నాయకులు సీహెచ్.గంగయ్య, పార్టీ సభ్యులు పాల్గొన్నారు.

యర్రగొండపాలెంలోనిత్యావసర సరుకుల పంపిణీ

లాక్​డౌన్ నేపథ్యంలో పేదలు పనుల్లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. వారికి అండగా దాతలు ముందుకు వచ్చి సాయం అందిస్తున్నారు. యర్రగొండపాలెంలోని వెంకట సురేష్ అనే వ్యక్తి అర్చకులకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

ఇదీ చూడండి:

పోలీసుల పనితీరు హర్షణీయం: సిద్దార్ధ్ కౌశల్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details