ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పీఠాపురంలో వైకాపా వర్గీయుల ఘర్షణ... పోలీస్ స్టేషన్​లో కౌన్సిలింగ్ - పీఠాపురంలో వైకాపా నాయకుల ఘర్షణ

ప్రకాశం జిల్లా పీఠాపురం గ్రామంలో వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాలపై బైండోవర్ కేసులు పెట్టి పోలీసులు పోలీస్ స్టేషన్​కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే పోలీసులు కొట్టటంతో తీవ్రంగా గాయపడ్డట్లు ఓ వర్గం ఆరోపణలు చేయటంతో... జరుగుమిల్లి ఎస్సై దాన్ని ఖండించారు. కేవలం ఇరువర్గాలను స్టేషన్​కు పిలిపించి కౌన్సెలింగ్ మాత్రమే ఇచ్చామని... ఎవ్వరిని కొట్టలేదని స్పష్టం చేశారు.

dispute between ycp followers in pitapuram at prakasam district
పీఠాపురంలో వైకాపా వర్గీయుల ఘర్షణ... పోలీస్ స్టేషన్​లో కౌన్సిలింగ్

By

Published : Aug 7, 2020, 11:28 PM IST

ప్రకాశం జిల్లా జరుగుమిల్లి మండలం పీఠాపురంలో వైకాపాలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పీఠాపురం గ్రామంలో నాడు నేడు కార్యక్రమంలో భాగంగా వైకాపాలో ఒక వర్గం పలు పనులు చేపట్టింది. ఈ పనుల్లో కాలువ విషయంలో మరో వర్గం అభ్యంతరం వ్యక్తం చేయటంతో... దీనిపై ఇరువర్గాలు ఈ నెల 4న గొడవ పడ్డరు.

విషయం పోలీసులకు తెలవటంతో ఇరువర్గాలపై బైండోవేర్ కేసులు పెట్టారు. మరోసారి గొడవ పడటంతో పోలీస్ స్టేషన్​కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. అయితే కౌన్సెలింగ్ పేరుతో తమ వర్గానికి చెందిన వారిని దారుణంగా కొట్టారని... వారు కొట్టటంతో తీవ్రంగా గాయపడి రిమ్స్​ ఆసుపత్రికి వెళ్లామని కొండలు వర్గం ఆరోపించారు. ఈ విషయాన్ని జరుగుమిల్లి ఎస్సై కమలాకర్ ఖండించారు. ఇరువర్గాలు గొడవ పడితే బైండోవర్ కేసు పెట్టి స్టేషన్​కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చామని, ఎవరినీ కొట్టలేదని, కొండలుపై గతంలో ఆరు కేసులున్నాయని ఆయన తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details