ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కిరణ్ కుటుంబసభ్యులను పరామర్శించిన ప్రజాసంఘాల నాయకులు - కిరణ్ కుటుంబసభ్యులను పరామర్శించిన ప్రజాసంఘాల నాయకులు

రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం వచ్చిన తరువాత దళితులమీద దాడులు ఎక్కువయ్యాయని... దళితహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీలం నాగేందర్ అన్నారు. ప్రకాశం జిల్లా చీరాలలో పోలీసుల దాడిలో గాయపడి మృతిచెందిన కిరణ్ కుమార్ కుటుంబసభ్యులను... వివిధ ప్రజాసంఘాలతో కూడిన నిజనిర్దరణ కమిటీ సభ్యులు పరిశీలించారు.

different political party leaders visit to dead kiran kumar family in chirala
కిరణ్ కుటుంబసభ్యులను పరామర్శించిన ప్రజాసంఘాల నాయకులు

By

Published : Jul 27, 2020, 11:45 AM IST

రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం వచ్చిన తరువాత దళితులమీద దాడులు ఎక్కువయ్యాయని... దళితహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీలం నాగేందర్ అన్నారు. ప్రకాశం జిల్లా చీరాలలో పోలీసుల దాడిలో గాయపడి మృతిచెందిన కిరణ్ కుమార్ కుటుంబసభ్యులను వివిధ ప్రజాసంఘాలతో కూడిన నిజనిర్దరణ కమిటీ పరిశీలనకు వచ్చింది. ముందుగా కిరణ్ కుమార్ ఇంటికి వెళ్లి అతని తల్లిదండ్రులను పరామర్శించి... సంఘటన పై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

కిరణ్ కుమార్ మృతికి కారణమైన ఎస్సై విజయ్ కుమార్​ను విధుల నుంచి తొలగించకుండా వీఆర్​కు బదిలీచేయటం ఏమిటని నీలం నాగేందర్ ప్రశ్నించారు. కిరణ్ మృతిపై పారదర్శకమైన విచారణ చేపట్టాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details