ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 16, 2021, 7:37 AM IST

ETV Bharat / state

వెలిగొండ ప్రాజెక్టుకు సేవలందించిన టన్నెల్‌ బోరింగు మిషన్‌ ధ్వంసం

వెలిగొండ ప్రాజెక్టు కోసం పుష్కరకాలం విశేష సేవలందించిన టన్నెల్‌ బోరింగు మిషన్‌ ధ్వంసం చేశారు. ప్రాజెక్టు మొదటి టన్నెల్​ నిర్మాణానికి ఈ యంత్రమే ఆధారమైంది.

Destruction of tunnel boring machine
టన్నెల్‌ బోరింగు మిషన్‌ ధ్వంసం

రాష్ట్రంలోని ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల నేల తల్లిని సస్యశ్యామలం చేసే వెలిగొండ ప్రాజెక్టుకు ఆకృతిని తీసుకొచ్చేందుకు సహకరించిన టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌ తన కర్తవ్యాన్ని పూర్తి చేసింది. నిరంతరంగా పుష్కర కాలంపాటు విశిష్ట సేవలందించిన ఈ యంత్రాన్ని తిరిగి వెనక్కి తెచ్చే అవకాశం లేక చివరకు ధ్వంసం చేయాల్సి వచ్చింది. గంగమ్మకు దారి చూపేందుకు వచ్చిన ఈ యంత్రాన్ని స్థానికులు అపురూపంగా చూశారు. యంత్రంలో ఉన్న సాంకేతిక పరికరాలను చూసి అబ్బురపడ్డారు. టన్నెల్‌ నిర్మాణానికి బోరింగ్‌ మిషన్‌ తప్పక అవసరమని నిర్ణయించి రూ.128 కోట్లు వెచ్చించి జర్మనీ నుంచి 2008లో తెప్పించారు. ఈ యంత్రం కొండను తొలుస్తూ ముందుకెళ్లడమే తప్ప వెనక్కు తెచ్చే వీలులేదు. మొదటి టన్నెల్‌ను నిర్మించడంతో యంత్రాన్ని ఈ మధ్యే 99శాతం ధ్వంసం చేసి విడిభాగాలను తుక్కుగా బయటకు తెచ్చారు.

ABOUT THE AUTHOR

...view details